ఎస్.ఎస్.రాజమౌళి .శంకర్ షణ్ముగమ్ .ఇద్దరు ఇద్దరే.వీరికి హీరోల స్టార్ డమ్ అక్కరలేదు.
నిజానికి వీరి సినిమాల్లో వీరే హీరోలు.ఈ కథతో కూడా సినిమా తీయొచ్చా అని మిగితా దర్శకులు ఆశ్చర్యపోయేలా చేస్తారు.
ఇండియన్ సినిమాను తక్కువ అంచనా వేసామే అని హాలివుడ్ ప్రేక్షకులు తమ తప్పు తెలుసుకునేలా గ్రాఫిక్స్ మాయాజాలం సృష్టిస్తారు.ఇప్పుడు బాహుబలి, 2 పాయింట్ 0 సినిమాలతో నువ్వు పెద్ద సినిమా తీస్తే నీకంటే పెద్ద సినిమా తీస్తా అన్నట్టు, నువ్వు వేయి కోట్లు కొడితే నేను కూడా వేయి కోట్లు కొడతా అన్నట్లు మొత్తం భారతదేశాన్ని తమ మార్కేట్ గా చేసుకున్నారు.బాలివుడ్ కి చుక్కలు చూపిస్తున్నారు
కాని ఈ పోటిలో ఒకరి మీద ఒకరు ఈర్ష్యాద్వేశం అయితే పెంచుకోలేదు కదా? నెం.1 స్థానం గురించి అవసరానికి మించి ఆలోచించట్లేదు కదా? సోషల్ మీడియాలో తాజా పరిణామాలు చూస్తోంటే ఇద్దరి మధ్య పోటి దాటి చిన్నిపాటి శత్రుత్వం మొదలైందనే చెప్పాలి.ఏం జరుగుతుందో చెప్పాలా?
ట్విట్టర్ లో ఈ ఇద్దరు దర్శకులు యాక్టీవ్ గానే ఉంటారు.అయితే రాజమౌళి ఫాలోయింగ్ ఎక్కువ అనుకోండి.
అది వేరే విషయం.ఇప్పుడు మీరు రాజమౌళి కన్నా శంకర్ గొప్ప అని ఇద్దరిని ట్యాగ్ చేసి ట్వీట్ చేసారనుకోండి .మిమ్మల్ని రాజమౌళి బ్లాక్ చేస్తారు.అదే శంకర్ కన్నా రాజమౌళి గొప్ప అని ఇద్దరిని ట్యాగ్ చేసి ట్వీట్ చేసారనుకోండి .మిమ్మల్ని శంకర్ బ్లాక్ చేస్తారు.ఇప్పుడు ట్విట్టర్ యూజర్లతో ఇదే జరుగుతోంది
దీన్నిబట్టే అర్థం అయిపోవట్లేదా? ఇద్దరి మధ్య పొటి వాతావరణం కాస్త యుద్ధవాతావరణంలా మారిందని! చూడాలి మరి .ఈ ఏడాది ఎవరిని విజేతగా నిలిచోబెడుతుందో! బాహుబలి పై చేయి సాధిస్తాడో లేక చిట్టి తన సత్తా చూపిస్తాడో.