బాహుబలి 2 పూర్తి కథ లీక్ అయిపోయింది

ఈ ఏప్రిల్, మే నెలల్లో భారతదేశమంతటా రెండంటే రెండే టాపిక్స్ వినబడతాయి.ఒకటి ఐపియల్ అయితే, రెండు బాహుబలి 2.

 Baahubali 2 Complete Story Leaked-TeluguStop.com

రెండూ వేల కోట్ల రూపాయల టర్నోవర్ ని రాబట్టేవే అని విశ్లేషకుల అంచనా.ఇక్కడే అర్థం చేసుకోండి బాహుబలి 2 ఫీవర్ దేశమంతటా ఎలా పాకిపోయిందో.

అందుకే ఏప్రిల్ 7న బాహుబలి మొదటిభాగం హిందీ ఆడియెన్స్ కోసం మళ్ళీ విడుదల చేస్తున్నారు.ఇక దేశమంతా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసం ఎదురుచూస్తోంటే, బాహుబలి 2 స్టోరీ ఇదేనంటూ నెట్ లో ఓ స్టోరీ హల్ చల్ చేస్తోంది.

ఇంతకి ఇంటర్నెట్ ప్రజానీకం ప్రకారం బాహుబలి 2 స్టోరీ ఏంటంటే…

మాహిశ్మతి సింహాసనాన్ని అధిష్ఠించిన అమరేంద్ర బాహుబలి ఓ గిరిజిన రాజు కూతురైన దేవసేనను చూసి ప్రేమిస్తాడు.భల్లాలదేవుడు కూడా ఆమెను కోరినా, తనని కాదని బాహుబలికి మనసిస్తుంది.

ఈ సమయంలో బాహుబలి దేవసేనతో ప్రేమగీతాలు ఆలపిస్తుండగా, మాహిశ్మతిలో అవమానభారం మోస్తున్న బిజ్జలదేవుడు, భల్లాలదేవుడు బాహుబలి మీద ఓ కుట్ర పన్ని, మాహిశ్మతి మీద వారే దాడులు చేయించి, ఆ దాడులు అడవిలో ఉన్న గిరిజన సేన చేయిస్తున్నట్లుగా, వారికి బాహుబలి మద్దతు ఉన్నట్లగా చిత్రీకరిస్తారు.ఇలానే శివగామిని నమ్మిస్తారు.

ఈ విషయం మీద స్పందించమని శివగామి దేవి బాహుబలికి సందేశాలు పంపినా, అవి బాహుబలికి చేరకుండా అడ్డుకుంటాడు భల్లాలదేవుడు.తన మనుషులనే దేవసేన రాజ్యం మీదకి పంపించి, అన్యాయంగా దాడులు చేయిస్తాడు.

ఆ దాడులను బాహుబలి అడ్డుకుంటుండుగా, ఇవేమి తెలియని శివగామి బాహుబలి మాహిశ్మతి ఎదురుతిరిగాడు అని పొరబడుతుంది.రాజ్య సింహాసనం నుంచి అతడ్ని తొలగించి రాజ్యం భల్లాలదేవుడి చేతిలో పెడుతుంది.

మాహిశ్మతి రాజ్యానికి, దేవసేన రాజ్యానికి మధ్య యుద్దఛాయలు కమ్ముకుంటుండగా, మాహిశ్మతి సైన్యం చీలిపోయి, ఓ భాగం భల్లాలదేవుడికి అండగా, మరో భాగం బాహుబలికి అండగా నిలుస్తుంది.ఈ అంతర్యుద్ధంలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, యుద్ధంలో ఒకవేళ భల్లాలదేవుడిపై బాహుబలి చేయి సాధిస్తే, బాహుబలి చేతిలో భల్లాలదేవుడి ప్రాణాలు కోల్పోయే అవకాశమే ఉంటే, బాహుబలిని కట్టప్ప చంపాలి.

ఇది మాహిశ్మతి రాజు ఆజ్ఞ కాబట్టి, కట్టుబానిస కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు.

బాహుబలిని కోల్పోయిన దేవసేన, కొడుకుని రక్షించుకోవాలని శివగామి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెబుతుంది.

మహేంద్ర బాహుబలిని బ్రతికించుకునే క్రమంలో దేవసేన భల్లాలదేవుడికి చిక్కి బంధీగా మారుతుంది.శివగామి మాత్రం తప్పు తెలుసుకోని, పసిబిడ్డతో తప్పించుకోని, నీట కొండ కింద ప్రాణాలు వదిలేసి, మహేంద్ర బాహుబలి ప్రాణాలు కాపాడుతుంది.

ఆ తరువాత ఏం జరిగిందో, ఇవన్ని తెలుసుకున్న మహేంద్ర బాహుబలి (శివుడు) ఏం చేస్తాడో మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube