బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాడు రాజమౌళి.తాను చేపట్టే ఎటువంటి ప్రాజెక్ట్ అయినా సరే హిట్ అవాల్సిందే అది ఈగని పెట్టి తీసినా సరే.
అందుకే రాజమౌళి ని చంద్రబాబు నాయుడు పిలిపించుకుని అమరావతి నిర్మాణంలో తన ఆలోచనలని పంచుకోమని గౌరవించారు.ఇదిఇలా ఉంటే.
రాజమౌళి నెక్స్ట్ ఏ సినిమాని తీయబోతున్నాడు అని అందరికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి .ఎటువంటి సినిమా తీయబోతున్నాడు.హీరో ఎవరు అనే ఉత్ఖంట అందరిలోనూ ఉంది.
అయితే అలా ఆలోచిస్తున్న వాళ్ళకి మాత్రం రాజమౌళి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతానికి సినిమాని చేపట్టే ఆలోచన ఏమి లేదు అన్నటుగా సంకేతం ఇచ్చాడు.ఇప్పుడు తనకి ఎంతో ఇష్టమైన పనిలో బిజీ అయ్యాడు.
బాహుబలితో రాజమౌళికి బానే మిగిలింది.ఈ డబ్బుతో హైదరాబాదు శివార్లలోని వంద ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
అందులో సుమారు “యాభై” ఎకరాల్లో మామిడి ,సపోటా మొక్కలని పెంచుతాడట.మరో యాభైలో వ్యవసాయం.
చేస్తాడట.
అంతేకాదు ఆ స్థలంలో ఫాంహోస్ని నిర్మించుకుంటున్నాడు వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు, ఇతర సదుపాయాలపై ద్రుష్టిపెడుతున్నాడు.
మూగజీవాలు అంటే రాజమౌళి కి ఎంతో ఇష్టం అందుకే ఆవులకోసం తన భూమిలో ఒక పాకని కూడా నిర్మిస్తున్నాడట.సహజసిద్దమైన పంటలు పండిచడానికి ఎంతో ఇష్టం చూపించే రాజమౌళి ఇప్పుడు అటువైపు అడుగులు వేస్తున్నాడు.
ఇదేమిట్రా నెక్స్ట్ సినిమా కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు అనుకుంటే ఇలా తన డ్రీం ప్రాజెక్ట్ విషయంలో ఆలస్యం చేస్తున్నాడు అని తెగ మధనపడిపోతున్నారు తన అభిమానులు.సర్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అని అడిగిన వాళ్లకి ఇదే నా నెక్స్ట్ డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పి ఆశ్చర్య పరుస్తున్నాడట జక్కన్న.