దర్శకధీరుడు రాజమౌళి దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఎక్కడ ఎలాంటి హడావుడి లేకుండా పూర్తి స్వేచ్చను నిర్మాతలు రాజమౌళికి ఇచ్చారు.
అయితే విడుదల దగ్గర పడుతున్న సమయంలో రాజమౌళిపై ఒత్తిడి వస్తోంది.ఈ సినిమాను బాలీవుడ్లో కరణ్ జోహార్ ప్రేక్షకుల ముందుకు తీసుకు బోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కరణ్ ప్రకటించాడు.బాలీవుడ్లో కరణ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
అటువంటి కరణ్ చెప్పిన డేట్కు సినిమా విడుదల చేయలేక పోతే పరువు పోతుంది.అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా చెప్పిన సమయానికి అంటే జులై 10న విడుదల చేయాల్సిందే అని రాజమౌళిపై ఒత్తిడి వస్తోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరుపుతున్న జక్కన్న అనుకున్న సమయానికి వర్క్ పూర్తి కాని పక్షంలో సినిమాను వాయిదా వేయాలని భావించాడు.అయితే కరణ్ జోహార్ ఒత్తిడి మేరకు ఎలాగోలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను అనుకున్న సమయంలోపే ముగించేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
దాంతో క్వాలిటీలో ఏదైనా తేడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.ఇంత కాలం మెల్లగా చేసుకుంటూ వెళ్లిన జక్కన్న ఇప్పుడు హడావుడి పడుతుండటంతో చిత్ర యూనిట్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఒత్తిడిలో జక్కన్న తాను ముందు నుండి అనుకుంటున్న విధంగా సినిమాను విడుదల చేయగలడా అనేది చూడాలి.