కుమారినే మళ్లీ కోరుకున్నాడు

‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌ను అందుకున్న రాజ్‌ తరుణ్‌కు తాజాగా ‘కుమారి 21ఎఫ్‌’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందించింది.మొదటి రెండు చిత్రాలను మించేలా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది.

 Raja Turn To Romance Hebha Patel Again-TeluguStop.com

ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ నటించిన విషయం తెల్సిందే.రాజ్‌ తరుణ్‌ మొదటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా అవికా గౌర్‌ నటించింది.

తాజాగా అదే సెంటిమెంట్‌ను రాజ్‌ తరుణ్‌ ఫాలో అవ్వాలని చూస్తున్నాడు.మరోసారి హెబ్బా పటేల్‌తో రొమాన్స్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో అవికాగౌర్‌ ఈయనకు సక్సెస్‌ను ఇచ్చింది.ఆమెతోనే మళ్లీ ‘సినిమా చూపిస్త మావ’ చేసి సక్సెస్‌ను దక్కించుకున్నాడు.

ఇక ఇప్పుడు ‘కుమారి 21ఎఫ్‌’తో సక్సెస్‌ను ఇచ్చిన హెబ్బాతో మరోసారి సినిమా చేసేందుకు రాజ్‌ తరుణ్‌ సిద్దం అవుతున్నాడు.అనిల్‌ సుంకర నిర్మాణంలో నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌లు ఒక సినిమాలో నటించబోతున్నారు.

ఆ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా నటించబోతుండగా, రాజ్‌ తరుణ్‌ కోసం హెబ్బా పటేల్‌ను ఎంపిక చేయడం జరిగింది.ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.

రాజ్‌ తరుణ్‌ మరోసారి హెబ్బాతో కలిసి సక్సెస్‌ కొడతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube