‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలతో అభిరుచి కలిగిన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాధకృష్ణ.హాసిని అండ్ హారిని క్రియేషన్స్లో ఈయన చేసిన రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే.
తాజాగా ఈయన నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఆ వార్తలను నిర్మాత రాధకృష్ణ తోసిపుచ్చాడు.
తాను నాగచైతన్యతో సినిమా చేయడం లేదని తేల్చి చెప్పాడు.
త్రివిక్రమ్ మద్దతుతో తాను నిర్మాణ సంస్థను ప్రారంభించాను అని, ఆయన దర్శకత్వంలోనే సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
తన మూడవ సినిమాను కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నాను అని, అందుకు ఆయన ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు తాను సిద్దంగా ఉన్నాను అంటూ ఈయన చెప్పుకొచ్చాడు.మహేష్బాబుతో త్రివిక్రమ్ తన తర్వాత సినిమా ఉంటుందని అంటున్నారు.
మరి రాధాకృష్ణకు ఆ సినిమా నిర్మించే అవకాశం వస్తుందేమో చూడాలి.