కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తాను అంటూ చెప్పి, చిరంజీవి అధికారికంగా ప్రకటించాడు.చిరంజీవి కోసం పూరి ‘ఆటో జానీ’ అనే కథను సైతం సిద్దం చేశాడు.
అంతా ఓకే అనుకుంటున్న సమయంలో పూరి తయారు చేసిన కథ తనకు నచ్చలేదు అని, అందువల్ల ఆ సినిమా చేయడం లేదు అంటూ ఏకంగా మీడియా ముందు చెప్పి పూరికి షాక్ ఇచ్చాడు.చిరు ప్రకటన వెంటనే పూరి స్పందిస్తూ.
ఆయన నేరుగా తనతో కథ గురించి మాట్లాడి ఉంటే బాగుండేది అని, అయినా కూడా చిరంజీవితో తాను ఎప్పటికి అయినా సినిమా చేస్తాను అంటూ పూరి గట్టిగా అప్పుడు ప్రకటించాడు.
తాజాగా చిరంజీవితో పాటు మెగా వర్గాలకు షాక్ ఇచ్చేలా పూరి తీసుకున్న నిర్ణయం ఉంది.
చిరంజీవితో తీయాలని భావించిన ‘ఆటో జానీ’ చిత్రాన్ని మాస్ రాజా రవితేజతో చేసేందుకు పూరి సిద్దం అవుతున్నాడు.చిరంజీవి 150వ సినిమా తాజాగా ఖరారు అయిన నేపథ్యంలో ‘ఆటో జానీ’ కథను రవితేజతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
రవితేజ సైతం కథను వినకుండానే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఆటో జానీ’గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.గతంలో ఇలా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలను వేరే హీరోలతో తెరకెక్కించి పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్నాడు.
తాజాగా అదే దారిలో ఈ సినిమాను కూడా రవితేజతో చేసి సక్సెస్ను పూరి అందుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.రవితేజ ‘ఆటోజానీ’ చిత్రం చేసి, అది సక్సెస్ అయితే మెగా వర్గాలకు అది చెంప పెట్టు అవుతుంది.