మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్కు దక్కింది.ఆగస్టు 22న చిరు 150వ సినిమాకు పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.అయితే అందుకు దాదాపు మూడు నెలలకు పైగా సమయం ఉంది.
ఇంత సమయం వృదా చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో కాని, దర్శకుడు పూరి జగన్నాధ్ మరో సినిమాను ప్లాన్ చేశాడు.ఈ గ్యాప్లో యువ హీరో నితిన్తో ఒక సినిమా చేసేయాలని నిర్ణయించుకున్నాడు.
‘హార్ట్ ఎటాక్’ సినిమా విడుదల అయిన వెంటనే వీరి కాంబినేషన్లో మరో సినిమా రావాల్సి ఉంది.కాని ఆ తర్వాత నితిన్ వేరే సినిమా, పూరి ఇతర ప్రాజెక్ట్లతో బిజీ అవ్వడం వల్ల ఆ సినిమా వాయిదా పడ్డటం జరిగింది.
మళ్లీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే స్క్రిఫ్ట్ వర్క్ పూర్తి అవ్వడంతో వెంటనే చిత్రీకరణ ప్రారంభించి నెల రోజుల్లోనే పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలని పూరి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే పూరి చేయాలనుకుంటున్న నితిన్ సినిమాపై మెగాస్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.నితిన్తో పూరి సినిమా చేయాలంటే చిరంజీవి అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక పూరి తెరకెక్కించిన ‘జ్యోతి లక్ష్మి’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.