పూరి ఫీల్‌ అయ్యాడు

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.ఆ సినిమాకు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

 Puri Jagannadh Is Upset With Media-TeluguStop.com

ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌లో ఒక ఆసక్తికర వార్త కథనం ప్రసారం అయ్యింది.

చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించడం పూరికి ఇష్టం లేదని, అందుకే మహేష్‌బాబుకు తాజాగా కథ చెప్పడం జరిగిందని, ఆ కథకు బాబు ఓకే చెప్పాడు, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తారు అనేది ఆ వార్త కథనం సారాంశం.అయితే ఈ వార్తపై దర్శకుడు పూరి జగన్నాధ్‌ మండి పడుతున్నాడు.

చిరంజీవి 150వ సినిమా చేయడం నాకు ఇష్టం లేదనే వార్త ఏం ఆధారంగా చేసుకుని ప్రసారం చేశారని, ఇలాంటి కథనాలు మనోభావాలను దెబ్బతీస్తాయని, అలాగే హీరో ఫ్యాన్స్‌ను కూడా హర్ట్‌ చేస్తాయంటూ పూరి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.ఈ వార్త తనను ఎంతగానో మనోవేధనకు గురి చేసింది అంటూ పూరి ఫీల్‌ అయ్యాడు.

చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టం, దాన్ని ఇష్టపడని వారు ఉంటారా అంటూ సన్నిహితుల వద్ద పూరి అంటున్నాడు.చిరంజీవి హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఆగస్టు 22న ఈ సినిమా ప్రారంభం కాబోతుంది.

ప్రస్తుతం హీరోయిన్‌ మరియు ఇతర తారాగణం ఎంపిక కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube