మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.ఆ సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్లో ఒక ఆసక్తికర వార్త కథనం ప్రసారం అయ్యింది.
చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించడం పూరికి ఇష్టం లేదని, అందుకే మహేష్బాబుకు తాజాగా కథ చెప్పడం జరిగిందని, ఆ కథకు బాబు ఓకే చెప్పాడు, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తారు అనేది ఆ వార్త కథనం సారాంశం.అయితే ఈ వార్తపై దర్శకుడు పూరి జగన్నాధ్ మండి పడుతున్నాడు.
చిరంజీవి 150వ సినిమా చేయడం నాకు ఇష్టం లేదనే వార్త ఏం ఆధారంగా చేసుకుని ప్రసారం చేశారని, ఇలాంటి కథనాలు మనోభావాలను దెబ్బతీస్తాయని, అలాగే హీరో ఫ్యాన్స్ను కూడా హర్ట్ చేస్తాయంటూ పూరి ట్విట్టర్లో పేర్కొన్నాడు.ఈ వార్త తనను ఎంతగానో మనోవేధనకు గురి చేసింది అంటూ పూరి ఫీల్ అయ్యాడు.
చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టం, దాన్ని ఇష్టపడని వారు ఉంటారా అంటూ సన్నిహితుల వద్ద పూరి అంటున్నాడు.చిరంజీవి హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆగస్టు 22న ఈ సినిమా ప్రారంభం కాబోతుంది.
ప్రస్తుతం హీరోయిన్ మరియు ఇతర తారాగణం ఎంపిక కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.