ఈరోజుల్లో ఒక్క రూపాయితో చాక్లేట్ కొనడం కూడా కష్టమైపోతోంది, అలాంటిది ఒక్కటంటే ఒక్కటే రూపాయికి మీరు ఏకంగా ఓ స్మార్ట్ ఫోన్ కొనే అవకాశం దొరకబోతోంది.రూపాయికే ఫోన్ ఏంటి అని తెలిగ్గా తీసుకోవద్దు.
ఇది నిజంగానే నిజం.దీపావళి సీజన్ కానుకగా ఈ ఆఫర్ ని అందిస్తోంది మొబైల్ దిగ్గజం షియోమి.
ఒక్క రూపాయితోనే 13MP కెమేరా, 41000 mAh బ్యాటరీ ఉండే రెడ్ మీ 3s స్మార్ట్ ఫోన్ నే కాదు, ఈ సంవత్సరం మొబైల్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలతో ప్రకంపనలు సృష్టిస్తున్న షియోమి రెడ్మీ నోట్ 3 కూడా సొంతం చేసుకోవచ్చు.
బాగా గుర్తుకుపెట్టుకోండి ఈ ఆఫర్ అక్టోబరు 17వ తేది నుంచి అక్టోబరు 19 వరకే మధ్యాహ్నం 2 గంటల సమయంలో అందుబాటులో ఉంటుంది.
అది కూడా ఫ్లాష్ సేల్స్ రూపంలో.ఇక ఈ ఫ్లాష్ సేల్స్ లో మీరు మొబైల్ కోసం పోటి పడాలంటే, ముందుగా mi.com లేదా MI అఫిషియల్ యాప్ లో రిజస్టర్ అవాల్సి ఉంటుంది.
ఆ తరువాత ఈ “Diwali with MI” సెక్షన్ లోకి వెళ్ళి ఆఫర్ వివరాలను, అక్కడిచ్చిన సూచనలు పాటిస్తూ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయాల్సి ఉంటుంది.అప్పుడే మీరు ఫ్లాష్ సేల్స్ లో ఒక్క రూపాయి చెల్లించి షియోమి ప్రాడక్ట్స్ కొనేందుకు అర్హులు అవుతారు.
ప్రాడక్ట్స్ వివరాలు :
అక్టోబరు 17 – Redmi 3S, Bluetooth
అక్టోబరు 18 – Redmi Note 3, 20000 mAh Power Bank
అక్టోబరు 19 – MI 4, MI Band
పైన ఇచ్చిన వివరాల ప్రకారం ఆయా తేదిల్లో ఆ ప్రాడక్ట్స్ ఒక్క రూపాయి ఫ్లాష్ సెల్స్ లో అందుబాటులో ఉంటాయి.