నీలిమా తిరుమలశెట్టి.ఈ పేరు గుర్తు వుందా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజా సినిమా నిర్మాత.స్వతహాగా ఐటీలో పెట్టుబడులు పెట్టే నీలిమ ఆ చిత్రంతోనే సినిమా నిర్మాణంలోకి దిగారు.తమిళ స్టార్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో 2011వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.
నిర్మాతలకు, పంపిణీదారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.పంపిణీదారులకు డబ్బులు చెల్లించే క్రమంలో పవన్ కళ్యాణ్ నిర్మాతకి తనవంతుగా సహాయం చేస్తానని మాటిచ్చారట.కానీ ఎలాంటి ఆర్థిక సహాయం ఇప్పటివరకు ఆమెకు అందలేదని ఫిలింనగర్ టాక్.
నీలిమ పంజా తరువాత అలియాస్ జానకి అనే మరో సినిమాని నిర్మించారు.
ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో ఎవరికీ గుర్తు లేదు.దాంతో ఆమె అప్పులు ఇంకా పెరిగి పోయాయి.
మరి నిలిమా కి పవన్ కళ్యాణ్ ఎందుకు సహాయం చేయాలి అంటే దానికి సమాధానం ఇవ్వలేం.ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతలకు పంపిణీదారులకు సహాయం చేయడం కొంత మంది అగ్ర హీరోలకి అలవాటు.
వ్యక్తిగతంగా వేడుకుంటే పవన్ కళ్యాణ్ స్పందించలేదేమో.అందుకే ఆవిడ నిన్న ట్విట్టర్ని వేదికగా చేసుకుని పవన్ కళ్యాణ్ నాకు సహాయం చేయండి అంటూ పబ్లిక్గానే ట్వీట్ వేశారు.
మళ్ళీ కాసేపటికి విషయాన్ని పబ్లిక్ కీ తీసుకెళ్లడం అనవసరం అనిపించిందేమో, ఆ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసేసారు.మరి పవన్ కళ్యాణ్ స్పందించేదెప్పుడు, ఆవిడకి సహాయం చేసేది ఎప్పుడు? సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నష్టాల విషయంలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.రోడ్డెక్కిన పంపిణీదారులకు ఎలాంటి నష్ట పరిహారం దొరకలేదు.మరి ఇన్నేళ్ళ గడిచిన తరువాత నీలిమా తిరుమలశెట్టి కి సహాయం దొరుకుతుందంటారా?
.