మారుతి దర్శకత్వం పర్యవేక్షణలో వచ్చిన సూపర్ హిట్ హర్రర్ కామెడీ ప్రేమ కథా చిత్రమ్.సుదీర్ బాబు హీరోగా, తెరకెక్కిన ఈ సినిమా అతని కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడంతో పాటు, హర్రర్ కామెడీ సినిమాలకి టాలీవుడ్ లో మార్గం ఏర్పరించింది.
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ సినిమాగా నిలిచిపోయిన ఈ సినిమాకి సీక్వెల్ హరి కిషన్ అనే దర్శకుడు తెరకెక్కించాడు.సుమంత్ అశ్విన్, నందిత శ్వేత హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ తో ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది.
ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.ఇందులో నందిత శ్వేతా దెయ్యంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.హీరోని దెయ్యం వెంటాడటం, అలాగే అందరితో ఆడుకోవడం ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది.అయితే ట్రైలర్ లో కామెడీ కంటెంట్ కి పెద్దగా స్కోప్ లేదని చెప్పాలి.
మరి హర్రర్ కామెడీగా సూపర్ హిట్ మూవీ ప్రేమ కథా చిత్రమ్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ఎ మేరకు మెప్పిస్తుంది చూడాలి.