ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోన్న వైసీపీ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకుంది.ప్రశాంత్ కిషోర్ జూన్ 1వ తేదీ నుంచి తన పని ప్రారంభించారు.
హైదరాబాద్లో జగన్కు చెందిన భారతి సిమెంట్స్కు సంబంధించిన కార్యాలయంలో దిగిన ప్రశాంత్ ఏపీలో అప్పుడే ఓ విడత సర్వే పూర్తి చేసేసినట్టు తెలుస్తోంది.ఏపీలోని లోక్సభ నియోజకవర్గాలు కాకుండా అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోను పార్టీ పరిస్థితి ఎలా ఉందన్నదానిపై సమగ్ర సర్వే చేసి పార్టీ అధినేత జగన్కు అందజేసేశారు.
ఈ 175 నియోజకవర్గాల్లోను ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలి ? ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ? నియోజకవర్గాల ఇన్చార్జ్ల విషయంలో కొంతమందిని పక్కన పెట్టాలని పీకే చెప్పడంతో ప్రస్తుతం వైసీపీ అంతా పీకే ఫీవర్ పట్టుకుంది.పీకే జగన్కు ఇచ్చిన సర్వేలో ఎవరెవరి మీద ఏం చెప్పాడా ? అని అందరూ ఒకటే టెన్షన్తో ఉన్నారు.ఇక ఏపీలో త్వరలో జరుగుతోన్న కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై ప్రశాంత్ కిషోర్ దృష్టి పెట్టారు.నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని గెలిపించాలని ఆయన సవాల్ గా తీసుకున్నారు.
ఈ క్రమంలోనే పీకేను జగన్ బుధవారం పార్టీలో సీనియర్ నేతలకు పరిచయం చేశారు.ఇక నంద్యాలలో శిల్పా మోహన్రెడ్డి గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు అమలుపర్పాలన్నదానిపై ప్రశాంత్ కిషోర్ ఫోకస్ పెట్టారు.
అంతేకాకుండా ఈనెల 8,9వ తేదీల్లో విజయవాడలో జరిగే వైసీపీ ప్లీనరీలో ఉండాల్సిన అజెండాను సయితం ప్రశాంత్ కిషోర్ ఖరారు చేసినట్టు సమాచారం.
విజయవాడ ప్లీనరీలో 2019 ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక అంశాలను జగన్ ప్రకటించేలా కిషోర్ ప్లాన్ చేస్తున్నాడట.
ఇక జగన్లో సైతం కిషోర్ దెబ్బతో చాలా మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది.ఓవరాల్గా ఇప్పుడు వైసీపీని ప్రశాంత్ కిషోర్ శాసిస్తుంటే, వైకాపా నాయకులకు మాత్రం పీకే టెన్షన్ గట్టిగానే పట్టుకుంది.