సౌత్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రకాష్ రాజ్ ఇటీవల శ్రీమంతుడుగా మారి తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పటికే ఆ దత్తత గ్రామంలో రోడ్డు దగ్గర నుంచి మంచి నీటి వరకు అన్ని సౌకర్యాలను దాదాపు ప్రకాష్ రాజ్ అందించడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆ ఒక్క గ్రామంతో తృప్తి పడని ప్రకాష్ రాజ్ ఇప్పుడు తన సాయాన్ని పక్కనున్న కమ్మదనం గ్రామానికి కూడా పొడిగించడం విశేషం.ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా తాజాగా కమ్మదనంలో ఒక బోర్ తవ్వించి గ్రామానికి మంచి నీటి సౌకర్యాన్ని కల్పించారు.
ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఇలా గ్రామస్తుల నీటి కొరత తీర్చడం సంతోషంగా ఉందని పేర్కొని గ్రామంలోని ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
కాగా, ప్రకాష్ రాజ్ ఈ శనివారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు.