‘బాహుబలి’ సినిమా విడుదలకు ముందు కొన్ని పోస్టర్లను జక్కన్న విడుదల చేసి, ఆ పాత్ర గురించి కొంత సమాచారం కూడా వెళ్లడించాడు.జక్కన్న ప్రయోగం సూపర్ హిట్ అయ్యింది.
అప్పటి వరకు ఉన్న అంచనాలు పోస్టర్ల విడుదల తర్వాత డబుల్ అయ్యాయి అంటే ఏమాత్రం అతి శయోక్తి కాదు.ఆ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో, గుణశేఖర్ సైతం తన ‘రుద్రమదేవి’ చిత్రానికి అదే పద్దతి ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
అందులో భాగంగానే చిత్రంలోని ప్రకాష్ రాజ్ మరియు కృష్ణం రాజు పాత్ర లుక్ను దర్శకుడు రివీల్ చేశాడు.
కాకతీయ సామ్రాజ్యం మహామంత్రి శివదేవయ్యగా ప్రకాష్ రాజ్ను ప్రేక్షకుల ముందుకు గుణశేఖర్ తీసుకు వచ్చాడు.
ఇక గణపతిదేవ చక్రవర్తిగా కృష్ణంరాజును దర్శకుడు తీసుకు వచ్చాడు.వీరిద్దరు కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సినిమాకు సంబంధించిన మరిన్ని పోస్టర్స్ను విడుదల చేసేందుకు గుణశేఖర్ ఏర్పాట్లు చేస్తున్నాడు.జక్కన్న పొందిన ఫలితాన్ని గుణశేఖర్ ఈ ప్రయోగం ద్వారా పొందుతాడో లేదో అనేది చూడాలి.