ఈవెంట్ ఏదైనా ఎందాకని హీరోలను మాత్రమే చూస్తాం చెప్పండి.అసలు ఈవెంట్స్ పెట్టేదే హీరోయిన్స్ వేసే కాస్టూమ్స్ చూసేందుకు అన్నట్టు కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి.
అదో ఆడియో ఫంక్షన్ అయినా అవార్డ్ ఫంక్షన్ అయినా హీరోయిన్స్ లేనిదే కలరింగ్ ఉండదు.అందుకే సినిమాకు సంబందించిన ఏ ఈవెంట్ అయినా కొద్దిగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ను ఇన్వైట్ చేస్తారు.
అయితే జరిగే ఈవెంట్ కు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా వచ్చి తమ మెరుపులు మెరిపిస్తుంటారు అందాల భామలు.నిన్న జరిగిన ఇంకొక్కడు ఆడియోలో అసలు హీరోయిన్స్ నయనతార, నిత్యా మీనన్స్ కాగా ఆడియో ఈవెంట్ లో ప్రత్యక్షమయ్యింది మాత్రం ప్రగ్యా జైశ్వాల్.
కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న నయన్ ప్రమోషన్స్ రమ్మని అడిగే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు.అమ్మడి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల సినిమాలో ఎలాంటి రోల్ అయినా ఓకే కాని దాని ప్రమోషన్ కోసం అయితే సారీ అని ముందే చెప్పేస్తుందట.
ఇక నిత్యా కూడా సెకండ్ హీరోయిన్ గా అయ్యే సరికి కొన్ని ఈవెంట్ లకు అటెండ్ అవుతూ మరికొన్నిటికి డుమ్మా కొడుతుంది.ఇంకొక్కడు ఆడియోకి అటు నయన్, ఇటు నిత్యా ఇద్దరు హ్యాండ్ ఇచ్చేసరికి ఆ ప్లేస్ లో ఈవెంట్ కు గ్లామర్ తోడవ్వాలని ప్రగ్యా అటెండ్ అయ్యింది.
కంచె సినిమాతో అందరి దృష్టిలో పడిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో మంచి జోష్ లో ఉంది.ప్రగ్యా రావడం వల్ల ఆడియో ఫంక్షన్ కు ఉపయోగం ఏంటో తెలియదు కాని ఒక్క హీరోయిన్ అయినా ఈవెంట్ లో ఉండాలనే ఉద్దేశంతో ఆమెను పిలిచినట్టు ఉంది.