కృష్ణవంశీ నక్షత్రం సినిమాలో స్టార్ కాస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది.సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే సాయి ధరం తేజ్ గెస్ట్ రోల్, కాజల్ తో ఓ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే వీరు చాలదు అన్నట్టు ఇప్పుడు కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ ను కూడా నక్షత్రం సినిమాలో తీసుకున్నాడట కృష్ణవంశీ.ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ట్ అయిన ఈ మూవీలో వీరందరు భాగమవుతుంటే సినిమాపై క్రేజ్ పెరుగుతుంది.
కొత్త దర్శకులు తమ న్యూ టాలెంట్ తో సత్తా చాటుతుంటే ఒకప్పుడు గ్రేట్ అనిపించుకున్న కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరక్టర్స్ హిట్ కోసం కిందా మీదా పడుతున్నారు.నక్షత్రం సినిమాను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్న వంశీ సినిమాతో హిట్ కొట్టేయడం ఖాయమనేస్తున్నారు.
అందుకే సినిమాకు మరింత కలరింగ్ అద్దేలా చిన్న పాత్రలకు కూడా క్రేజీ స్టార్స్ ను తీసుకుంటున్నాడట.మరి కృష్ణవంశీ చేస్తున్న ఈ వర్క్ అవుట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయో కాని హిట్ కొడితే కృష్ణవంశీ మళ్లీ ట్రాక్ ఎక్కేసినట్టే అంటున్నారు సిని జనాలు.
.