ప్రభుదేవా కథానాయకుడిగా తమన్నా నాయికగా ‘అభినేత్రి’ సినిమా, షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఈ రోజు నుంచి ప్రభుదేవా ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.
ఈ సాంగ్ లో ఎమీ జాక్సన్ మెరవనుంది.
ఈ సినిమాకి ఈ సాంగ్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.దాదాపు నాలుగు రోజుల పాటు ఈ పాటను ఇక్కడ చిత్రీకరించనున్నారు.70 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, తెలుగు .తమిళ .హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.
విజయ్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, హారర్ నేపథ్యంలో రూపొందుతోంది.
ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన తమన్నా, మొదటిసారిగా హారర్ చిత్రంలో చేస్తోంది.మరి ఈ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఏ మేర భయపెడుతుందో చూడాలి.