మహేష్ , ఎన్టీఆర్ తరవాత ప్రభాస్

శ్రీమంతుడు సినిమాతో ఒక నిర్మాత కలగనే రేంజ్ ఎంట్రీ ఇచ్చింది మైత్రీ మూవీస్ బ్యానర్.మొదటి సినిమా తోనే రికార్డ్ బ్రేకింగ్ సినిమా అదీ ఇండస్ట్రీ హిట్ సాధించింది.

 Prabhas – Ntr – Mahesh Babu – Koratalasiva-TeluguStop.com

టాలీవుడ్ లో తన ప్రస్తానం అద్భుతంగా మొదలు పెట్టిన మైత్రీ మూవీస్ వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.తరవాత సినిమా ని జూనియర్ ఎన్టీఆర్ తో లాక్ చేసుకున్న వారు తమ ఆస్థాన డైరెక్టర్ కొరటాల శివ ని దర్శకుడిగా పెట్టి జనతా గ్యారేజ్ తీస్తున్న సంగతి తెలిసిందే.

ఇలోగా తమిళంలో ఈ సంస్థ వారు ఎంట్రీ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు తెలుగులో మూడవ సినిమా విషయంలో కూడా మైత్రీ మూవీస్ అప్పుడే హీరోలని కదిలిస్తోంది.

తమ బ్యానర్ లో మూడవ సినిమా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో చెయ్యడానికి మైత్రీ వారు ప్లాన్లలో ఉన్నట్టు సమాచారం.ఇందుకోసం ఆల్రెడీ ప్రభాస్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట మైత్రి మూవీస్ అధినేతలు.

ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి-2 పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.అతను ఆ సినిమా నుంచి బయటికి వచ్చాక రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ లో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ.

అతను ఎప్పుడు ఖాళీ అయినా తమతో సినిమా చేసేలా ప్లాన్ చేస్తోందట మైత్రి మూవీస్.

మొత్తానికి అదిరిపోయే కాంబినేషన్లు సెట్ చేస్తూ తమ ప్రత్యేకత చాటుకుంటున్న మైత్రి మూవీస్ మున్ముందు టాలీవుడ్ బిగ్ బేనర్లలో ఒకటిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది.

మరి మైత్రి మూవీస్ బేనర్లో ప్రభాస్ చేయబోయే సినిమాకు దర్శకుడెవరో మరి.తొలి రెండు సినిమాలు చేసిన కొరటాలనే లైన్లో పెడతారా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube