‘మిర్చి’ సినిమా వచ్చి దాదాపుగా రెండున్న సంవత్సరాలు అయ్యింది.అయినా ఇప్పటి వరకు ప్రభాస్ సినిమా వచ్చింది లేదు.
ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా కోసమే తన డేట్లు మొత్తం కేటాయించాడు.ఈ రెండున్న సంవత్సరాలు తన జీవితాన్ని, కెరీర్ను మొత్తం కూడా రాజమౌళి చేతిలో పెట్టాడు.
ఎట్టకేలకు ‘బాహుబలి’ మొదటి పార్ట్ విడుదలకు సిద్దం అయ్యింది.‘బాహుబలి’ మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాకుండానే ప్రభాస్ తన కొత్త సినిమాను తన స్నేహితుల నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్లో ప్రారంభించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
‘రన్ రాజా రన్’ సినిమా దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించబోతున్నట్లుగా నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్లు ప్రకటించారు.మొదటి నుండి చెబుతు వచ్చిన దాని ప్రకారం ఈ సినిమా మేలోనే ప్రారంభం అవ్వాల్సి ఉంది.
కాని ఇప్పటి వరకు ప్రారంభం అవ్వలేదు.ఈ నెలలో అయినా ప్రభాస్, సుజీత్ల సినిమా ప్రారంభం అవుతుందేమో అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలో కూడా ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని తేలిపోయింది.వచ్చే నెల 10న ‘బాహుబలి’ విడుదల కాబోతుంది.
అప్పటి వరకు కూడా ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.అందుకే కొత్త సినిమాకు జక్కన్న అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
వచ్చే నెలలో ప్రభాస్ నయా మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.