ఈమధ్య తాప్సి పేరు వినిపించినంటగా మరో హీరోయిన్ పేరు వినిపించలేదు.ఎప్పుడైతే రాఘవేంద్రరావు మీద వివాదాస్పదమైన కామెంట్స్ చేసిందో, అప్పటినుంచి నెగెటివ్ గానో, పాజిటివ్ గానో, మొత్తానికైతే నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చింది తాప్సి.
ఈ అమ్మడు చాలాకాలం తరువాత నటించిన తెలుగు సినిమా “ఆనందో బ్రహ్మ”.ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది తాప్సి.అయితే ప్రమోషన్స్ కోసం కేవలం ఈ అమ్మడు మాత్రమే కష్టపడటం లేదు.
తాప్సి కోసం ప్రభాస్ తో పాటు సుధీర్ బాబు కూడా కష్టపడుతున్నారు.అవును కదా, ఇద్దరు ఆ సినిమా ఫంక్షన్ కి కూడా వచ్చారు, వీరికి తాప్సితో ఏమిటి సంబంధం అనుకుంటున్నారా?
వీరి బంధం, అనుబంధం కేవలం తాప్సితోనే కాదులేండి.సినిమాల్లోకి రాకముందు నుంచే ప్రభాస్, సుధీర్ బాబు మరియు 70 ఏం ఏం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు మంచి స్నేహితులు.అంటే ఈశ్వర్ మొదలవడానికి ముందు నుంచే అన్నమాట.అందుకే తమ స్నేహితుల కోసం ఈ ఇద్దరు కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.70 ఏంఏం నిర్మాతలకి మంచి థియేటర్లు జరిగేలా చూసుకున్నాడట ప్రభాస్.ఇక సుధీర్ బాబు అయితే ఆనందో బ్రహ్మ “ప్రేమ కథాచిత్రం” కంటే చాలా బాగుంటుందని ఇప్పటికే ఓ రివ్యూ పెట్టేసాడు.
మరి నిర్మాతలైన తమ స్నేహితుల కోసం, తాప్సి కోసం ఈ ఇద్దరు హీరోలు చేసిన ప్రమోషన్స్ ఎంతవరకు పనికోస్తాయో రేపు ఓపెనింగ్స్ ని చూస్తే అర్థమైపోతుంది.
మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తాప్సితో పాటు శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.మనుషుల్ని చూసి దెయ్యాలే భయపడటం అనే వెరైటి కాన్సెప్ట్ తో ఈ సినిమాని తీసారు.