విద్యుత్ చార్జీలు అకారణంగా ఏదో కొంప మునిగింది అన్నట్టుగా ఎందుకు పెంచారు అని సిపిఐ నేతలు ఏపి సర్కార్ ను ప్రశ్నించారు.పెంచిన చార్జీల్లో సామాన్యున్ని తప్పించామన్నారు కాని అన్ని వర్గాల వారిని వదలకుండా వడ్డించారు.
ఇప్పుడు బొగ్గు ధర పెరిగితే సర్కార్ కు తడిపి మోపెడు అదనపు భారం అవుతుంది అనే అరిచి గీపెట్టడానికి కాని బొగ్గు ధర చాలా తగ్గిపోయింది అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు ఇలా పెంచడానికి నడుం బిగించారు అర్ధం కాకుండా వుంది .ఆయన పాలన పాత విధానాన్ని తలపిస్తోంది అని ఆ నేతలు దుయ్యబట్టారు .బాబు మైండ్ సెట్ మారిందని చెప్పడం కాదు ఆచరణలో చూపాలి అని విమర్శించారు .మరో వైపు పలు పార్టీలకు చెందినవారు అదేపనిగా విద్యుత్ చార్జీలు పెంచడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .