పోసాని మరోసారి హైలైట్‌ అవ్వనున్నాడా?

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పోసాని కృష్ణమురళి ఒక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.ఆ సినిమాలో ఉన్నది కాసేపు అయినా కూడా హైలైట్‌గా నిలిచాడు.

 Posani To Be Major Highlight Of Gopala Gopala-TeluguStop.com

ఏసునాధ అంటూ పోసాని పలికిన డైలాగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా మరోసారి పోసాని తన మార్కు కామెడీతో ‘గోపాల గోపాల’ సినిమాలో ఆకట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

‘గోపాల గోపాల’ సినిమాలో పోసాని స్వామీజీగా నటించి నవ్వులు పూయించబోతున్నాడు.ఈ సినిమాలో వెంకటేష్‌ మరియు పోసాని అలాగే పవన్‌ కళ్యాణ్‌ మరియు పోసానిల మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

పోసాని కామెడీ ఈ సినిమాకు ప్రత్యేక ఆర్షణగా నిలుస్తుందని, ఈ సినిమాలో స్వామిజీగా చేసిన పోసానికి మరింత క్రేజ్‌ వస్తుందని అంటున్నారు.ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్‌బాబు మరియు శరత్‌ మరార్‌లు సంయుక్తంగా నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube