టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పూజా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.
అంతేకాకుండా హీరోలకు, దర్శక నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా కూడా మారిపోయింది.బాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.కాగా ఈమె ఇటీవలే రాధే శ్యామ్, ఆచార్య, అలాగే బీస్ట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
పూజా హెగ్డే నటించిన ఈ మూడు సినిమాలు కూడా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ కు తెచ్చుకున్నాయి.
దీంతో పూజ హెగ్డే కాస్త డల్ అయినట్టుగా కనిపించింది.కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళి అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
అలాగే రణ్వీర్ సింగ్ తో కలిసి సర్కస్ అనే సినిమా కూడా చేస్తోంది.వీటితో పాటుగా అప్పుడప్పుడు పలు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ పలు రకాల బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది పూజ హెగ్డే.
కాగా ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు కూడా చేస్తూ ఉంటుంది.రోజురోజుకీ తన అందాన్ని మరింత రెట్టింపు చేస్తూ కొర్రకారుని తన వైపు తిప్పుకుంటోంది.
ఇదే కాకుండా పూజ హెగ్డే ని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.ఈ క్రమంలోనే తాజాగా పూజ హెగ్డే కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలలో పూజా హెగ్డే కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తున్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.