హైదరాబాద్తో పాటు ఇతర ముఖ్య పట్టణాల్లో హిజ్రాలు దాడులకు దిగుతున్నారంటూ గత కొన్ని నెలలుగా పోలీసులకు ఫిర్యాదు అందుతున్నాయి.దాంతో పోలీసులు హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు.
ప్రజలను డబ్బు అడుగుతూ వేదిస్తున్నట్లుగా తెలిస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని కొంత మంది హిజ్రాల సమక్షంలోనే పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు.
హైదరాబాద్లోని హిజ్రాలు డబ్బులు ఇవ్వకుంటే కొట్టడం, తిట్టడం ఇంకా అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతున్నాయి.
హిజ్రాలందరికి కౌన్సిలింగ్ ఇప్పించి, వారిని మంచిగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు.ఇటీవలే రైల్లో హిజ్రాలు ప్రయాణికుడిని వేదించిన తీరు మీడియాలో ప్రముఖంగా వచ్చిన విషయం తెల్సిందే.
దాంతో పోలీసులు సీరియస్ అయ్యారు.మరి ఇప్పటికైనా హిజ్రాలు తమ పద్దతిని మార్చుకుంటారో చూడాలి.