హీరో కం డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కం డాన్సర్ అయిన లారెన్స్ కి తమిళ – తెలుగు సినిమాలలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది.ఆయన నటించి, డైరెక్ట్ చేసిన ఏ సినిమా అయినా మొదటి రోజు టికెట్టు దొరకడం అంటే రెండు రాష్ట్రాల్లో కూడా జరిగే పని కానే కాదు అయితే ఇప్పుడు సినిమా వ్యవహారం లో కాకుండా వేరే పనిమీద లారెన్స్ వార్తల్లోకి ఎక్కాడు.
చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు ఇప్పుడు ఇతన్ని రెండు గంటల పాటు విచారించడం విశేషం.
కాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
వేందర్ మూవీస్ అధినేత మదన్ అనే ఆయన ఒక యూనివర్సిటీ లో మేడిక విద్యకి సంబంధించి సీట్ లు ఇప్పిస్తాను అని మాట ఇచ్చి కోట్లకి కోట్లు పంగనామం పెట్టి జారుకున్నాడు.ఈ వ్యవహారం జరిగిని 25 రోజుల తరవాత కూడా అతని ఆచూకీ ఎవ్వరికీ తెలియకపోవడం తో పోలీసులు రంగంలోకి దిగారు.
మదన్ కి సంబంధించిన స్నేహితులనీ, అతను కలిసి పని చేసేవారినీ , ఫామిలీ వారినీ అందరినీ పట్టుకుని మరీ విచారింకాహ్డం విశేషం.ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మదన్ ను సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు.
అందులో భాగంగా లారెస్న్ కూడా మదన్ తో లారెన్స్ కు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఆయన్ను కూడా విచారిస్తున్నారు ?
.