ప్రపంచమంతా ప్రధాని నరేంద్ర మోదీని స్ఫూర్తిదాయకుడిగా కీర్తిస్తోందని భాజపా మంత్రులు, నాయకులు పోటీలు పడి ప్రచారం చేస్తుండగా, ఓ కాంగ్రెసు నాయకురాలు మాత్రం దీన్ని రివర్్స చేసి మోదీకి స్ఫూర్తిదాయకుడు కాంగ్రెసు ఉపాధ్యాక్షుడు రాహుల గాంధీయేనని చెప్పిరు.ఆ నాయకురాలి పేరు రీటా బహుగుణ జోషి.
నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ‘మన్కీ బాత్’ పేరుతో రేడియోలో ఏదో ఒక అంశంపై ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమం రూపొందించడానికి స్ఫూర్తి రాహుల్ గాంధీయేనట…! రెండువేల నాలుగో సంవత్సరంలో రాహుల్ యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారని, దాన్ని మోదీ కాపీ కొట్టి ‘మన్కీ బాత్’ కార్యక్రమంగా రూపొందిచారని బహుగుణ అన్నారు.
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమమేదీ చేయలేదన్నారు.అయితే మన్కీ బాత్ విఫలమైపోయిందని, ఇది ప్రజలను చైతన్యపరచడంలేదని విమర్శించారు.
మోదీపై విమర్శలతో బహుగుణ తన మన్కీ బాత్ ఏమిటో చెప్పారు.మరి కాంగ్రెసు అనేక ఎన్నికల్లో ఓడిపోయింది కదా.రాహుల్ యువతను ఎంతమేరకు చైతన్యపరిచారు? ఎంతవరకు స్ఫూర్తి కలిగించారు?
.