"కాటి కాపరి" సైతం కన్నీళ్ళు పెట్టాడు!!

నిత్యం ఎన్నో మృతదేహాలను ఖననం చేసే కాటి కాపరులు వారి వద్దకు వచ్చే మృత దేహాలను చూసి పెద్దగా చలించిన సంధర్బాలు ఉండవనే చెప్పుకోవాలి.అయితే పాకిస్తాన్ లో జరిగిన పెషావర్ మారణ హోమం కాటి కాపరిని సైతం కన్నీళ్ళు పెట్టించింది.

 Peshavar Grave Digger Wept-TeluguStop.com

రోజూ ఎన్నో శవాలను ఖననం చేసే తాజ్ అనే ఒక కాటి కాపరి పెషావర్ ఘటనలో ఉగ్రవాదులో చేతుల్లో పిటల్లా రాలిన 140మంది పిల్లల సవాలను ఖననం చేసే ఏర్పాట్లు సైతం ఆయనే చేశాడు.అయితే రోజు ఎంతో మందిని ఖననం చేస్తూ పూట గడుపుకునే తాజ్ మహమ్మద్ పిల్లల దేహాలను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడట.

ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పని అయినప్పటికీ ఆ పిల్లల దేహాలను ఖననం చేసే సమయంలో తాను ఆ పనిని చాలా భారంగా భావించినట్లు వాపోయాడట.అంతేకాకుండా మృతదేహాలను చూసి చలించని అతడు నిర్జీవమైన పిల్లలను చూసి విపరీతంగా కదిలిపోవడమే కాకుండా భావోద్వేగానికి గురై కంట తడి పెట్టుకున్నాడని తెలుస్తుంది.

మరి ఇలాంటివి చూసైనా ఆ ముష్కరుల మనసు కరుగుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube