పచ్చని పంట పొలాలు.త్వరలోనే రాజధానిగా ఏర్పాడబోతున్న ప్రాంతం.
కట్ చేస్తే కొందరు మూర్ఖులు ఆ పొలాలకు నిప్పు పెట్టారు.నిజమే మీరు చదువుతున్నది తుళ్ళూరు ప్రాంతంలో జరిగిన సంఘటన గురించే.
అయితే ఈ పని జగన్ చేయించాడు అని టీడీపీ వారు బలంగా వాదించారు.ఇక ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో రైతులు బూసేకరణకు ఎదురు తిరగడంతోనే ప్రభుత్వం వారు ఇలా చేయించారు అని ప్రతిపక్షాలు ప్రత్యారోపణలు చేశాయి.
ఇక ఇది ఎవరు చేసారో.దీనికి కారణం ఎవరో అనే దానిపై ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు.
అయితే ఆ దొంగ దొరికాడు అని తెలుస్తుంది.విజయవాడ సమీపంలో అతడిని పోలీసులు పట్టుకొన్నారట.
ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి.పక్కా వివరాల ప్రకారం అతడిని పట్టుకొన్నామని.
అతడే నిప్పు పెట్టడానేదానికి ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.అంతేకాకుండా అందుకు సంబంధించి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారట పోలీసులు.
మరి ఇంతటికి అతడు వైకాపా వ్యక్తా.తెలుగుదేశం మద్దతుదారడా.
అనేది పోలీసులు చెబుతారేమో చూడాలి.ఏది ఏమైనా ప్రభుత్వానికి బంధువైతే అతని వివరాలు బయటకు రావడం కష్టమే అన్న వాదన ప్రజల్లో వినపడుతుంది.
మరి అతగాడు ఎవరో తెలియాలంటే మాత్రం పోలీసుల మాట కోసం వేచి చూడాల్సిందే.