జ‌నాన్ని గాలికొదిలేసి విదేశాల‌లో చ‌క్క‌రా?

తెలుగుదేశం పార్టీ రెండేళ్ళ పాలనలో రాష్ట్రంలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయ‌ని, ఇవి కాక కొత్త స‌మ‌స్య‌ల‌ను అధికార ప‌క్ష‌మే సృష్టించి ్ర‌ప‌జ‌ల‌ను ఇబ్బందులు పెడుతోంద‌ని, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.శ‌నివారం పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన గడపగడపకు వైకాపా రెండో రోజు కార్యక్రమంలోనూ ఆయ‌న పాల్గొని మాట్లాడుతూ, జ‌నం అనేక స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడుతుంటే చంద్ర‌బాబు చేసిందేమీలేద‌ని, ప్ర‌జ‌లు నిల‌దీత‌లు ప్రారంభ‌మ‌వుతుండ‌టంతో విదేశాల నుంచి పెట్టుబ‌డులు తెస్తానంటూ విమానాల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నార‌ని మిమ‌ర్శించారు.

 Peddireddy Fire On Ap Cm-TeluguStop.com

చంద్రబాబు ఎన్నికలకు మునుపు ప్రచురించిన మేనిఫెస్టో లోని ఏ ఒక్క హామీని సక్రమంగా నిర్వర్తించలేక పోయారని, ఈ వాగ్దానాలను అమలు పరిచ‌క పోవ‌టం ప‌ట్ల ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే గడపగడపకు త‌మ కార్య‌క‌ర్త‌లు వెళ్లాల‌ని అధినేత జ‌గ‌న్‌ పిలుపునిచ్చినట్లు తెలిపారాయ‌న‌.అవినీతి సొమ్ముతో అధికార ప‌క్షం త‌మ పార్టీకి చెందిన శాస‌న‌స‌భ్యుల‌ను కొనుగోలు చేస్తున్న తీరును కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని, వారే అంతిమ నిర్ణేత‌ల‌ని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube