తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘24’.సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
తెలుగులో ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాలతో సక్సెస్ను సాధించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘24’ సినిమా తెరకెక్కుతోంది.గతంలో ఈయన తెరకెక్కించిన హర్రర్ సినిమా ‘13బి’ సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు అదే జోనర్లో ఈ ‘24’ను విక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.తమిళంలో భారీ అంచనాలున్న ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ రైట్స్ను యువ హీరో నితిన్ దక్కించుకున్నాడు.
‘మనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసిన విక్రమ్ ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయగలడు అనే నమ్మకంతో నితిన్ ఈ సినిమాను ఏకంగా 20 కోట్లు పెట్టి డబ్బింగ్ రైట్స్ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోగా నటించిన సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.
అలాగే సమంత తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకు పోతుంది.మరో హీరోయిన్గా నటిస్తున్న నిత్యామీనన్కు సైతం తెలుగులో మంచి క్రేజ్ ఉంది.
ఇక దర్శకుడు రెండు సక్సెస్లతో ఇప్పటికే తెలుగులో జెండా పాతాడు.దాంతో నితిన్ ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు.
మరి నితిన్ నమ్మకం నిలబడి, లాభాలు వస్తాయా లేక ఫలితం తారు మారు అవుతుందో చూడాలి.