మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ల మధ్య గత కొంత కాలంగా సైలెంట్ వార్ నడుస్తుంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది.ఇప్పటికే వీరిద్దరు స్టేజ్పై కలిసి అభిమానులకు కనిపించి చాలా సంవత్సరాలే అయ్యింది.
దాంతో వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.ఇక పవన్ కళ్యాణ్ పెట్టిన ‘జనసేన’ పార్టీ చిరంజీవికి ఇష్టం లేదని, అందుకే పవన్తో అంటి ముట్టనట్లుగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు.
అలాగే చిరంజీవి కాంగ్రెస్తో కలవడం కూడా పవన్కు ఇష్టం లేదని టాక్.
వీరిద్దరిని కలిపేందుకు మెగా బ్రదర్ నాగబాబు ప్రయత్నాలు చేసినా కూడా అది సాధ్యం కాలేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు ప్రస్తుతం ఉన్న విభేదాలకు స్వస్తి పలికి అభిమానుల ముందుకు రావాలని నిర్ణయించారు.ఆగస్టులో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ భారీ స్థాయిలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వారం రోజుల పాటు నిర్వహించే ఈ చిరు బర్త్డే వేడుకల ప్రారంభ రోజు పవన్ కళ్యాణ్ కూడా పాలు పంచుకోబోతున్నట్లుగా చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు స్వామినాయుడు చెప్పుకొచ్చాడు.మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకే స్టేజ్పై కలవబోతున్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర మెగా హీరోలు సైతం కనిపించబోతున్నారు.