మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా నిర్మిస్తున్ననట్లు ప్రకటించారు టీ.సుబ్బరామిరెడ్డి.
అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్పారు.ఇంత సంచలన ప్రకటన వచ్చినా, సాధరణ ప్రేక్షకులని పక్కనపెడితే కనీసం మెగా అభిమానులు కూడా ఎక్కువగా ఉత్సాహపడలేదు.కారణం? ఈ ప్రకటనపై ఎవరికి నమ్మకం లేకపోవడమే.
అసలు ఈ విషయం పవన్ కళ్యాణ్ కి తెలుసా? చెప్పే ప్రకటించారా అని అనుమానపడ్డారు చాలామంది.ఇదిలా ఉంటే మీడియా తన పని తాను చేసుకుంటూపోయింది.చిరంజీవికి పాతిక కోట్లు, పవన్ కళ్యాణ్ కి పాతిక కోట్లు, త్రివిక్రమ్ కి పదిహేను కోట్లు ఈ ప్రాజెక్టు చేస్తున్నందుకు ముడతాయని గాలివార్తలు ప్రచారం చేసింది.
మొత్తానికి అనుకున్నదే జరిగింది.అంత ఉత్తుత్త డ్రామానే అని తేలిపోయింది.ఈ మల్టిస్టారర్ నిజమేనా? మెగాస్టార్ పవర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా నిజంగానే రాబోతోందా అని పవన్ కళ్యాణ్ ని అడిగితే, అసలు తన వరకు అలాంటి ప్రపోజల్ కూడా రాలేదని తేల్చిపడేసాడు తమ్ముడు.ఇక అన్నయ్య ఇంతవరకు ఈ విషయం మీద స్పందించలేదు.
సో, మెగా మల్టిస్టారర్ లేదన్నమాట.అప్పట్లో రజినీకాంత్ – మహేష్ బాబుతో మల్టిస్టారర్ నిర్మిస్తున్నానని ఓ నిర్మాత ప్రకటించాడు గుర్తుంతా? ఇది కూడా అలాంటి టైంపాస్ ప్రకటనే అనుకోండి.