ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేన అధినేత పవన్.తొలిసారి నేరుగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు.
హోదా ఇవ్వాలనే డిమాండ్తో ఆర్కే బీచ్లో యువత చేపట్టిన శాంతియుత నిరసనను ప్రభుత్వం అణిచివేసిన విషయం తెలిసిందే! ఈ విషయంపై టీడీపీ-బీజేపీపై పవన్ ఫైర్ అయ్యారు.హోదా విషయంలో మాట మార్చడంపై టీడీపీ అధినేతకు వరుస ప్రశ్నలు సంధించారు.
ఇప్పటివరకూ పవన్ ఎన్ని విమర్శలు చేసినా వాటిని సూచనలుగానే పరిగణిస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే! మరి హోదా విషయంలో పవన్ ఎక్కుపెట్టిన అస్త్రాలకు బాబు దగ్గర ఉందా? లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది!!
టీడీపీ ప్రభుత్వంపై పవన్ తొలిసారిగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.ఇప్పటివరకూ ప్రతిపక్ష నేత జగన్, ఇతర పార్టీల నేతలు ప్రత్యేక హోదాపై మాట మార్చడాన్ని ప్రశ్నించినా వాటిని లైట్ తీసుకున్నారు చంద్రబాబు.
కానీ ఇప్పుడు సాక్షాత్తూ చంద్రబాబుకు మిత్రుడైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోదా గురించి ప్రశ్నించడం బాబును కొంత ఇబ్బందికి గురిచేసే అంశం! శుక్రవారం ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కల్యాణ్… ముఖ్యమంత్రిపై కొన్ని ప్రశ్నలు స్పందించారు.ఆ ప్రశ్నలకు తనకు జవాబు ఇవ్వకపోయినా, ప్రజలకు చెప్పాలంటూ కోరారు.
ప్రత్యేక హోదా.సంజీవని అని చెప్పిన చంద్రబాబు.
హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తామంటే ఎందుకు రాజీపడ్డారో వివరించాలని పవన్ ప్రశ్నించారు.ఈ విషయమై మిమ్మల్ని రాజీపడమని ఎవరైనా ఇబ్బంది పెట్టారా… అలాంటివారు ఎవరున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
హోదాను మించిన ప్యాకేజీ వచ్చిందని ప్రజలపై రుద్దే ప్రయ త్నం ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తన సలహా వల్లనే ప్రధాని చేశారని చెప్పుకున్నారనీ… ఆ తరువాత కాదన్నారనీ, ఇదే తరహాలో ప్రత్యేక హోదా విషయంపై మాట మార్చలేదనడానికి నమ్మకం ఏంటన్నారు.? ఈ విషయంలో తన తప్పును ఎప్పట్లోగా దిద్దుకుంటారని చంద్రబాబును పవన్ అడిగారు.రాయపాటి, సుజనా వంటి నాయకుల్ని ఎందుకు పక్కన పెట్టుకున్నారని పవన్ ప్రశ్నించారు.
మరి ఈ ప్రశ్నలకు బాబు సమాధానం చెబుతారా లేదా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.