రాజమౌళి లాంటి దర్శకుడి అవసరం లేదు వాళ్ళకి .గ్రాఫిక్స్, భారి బడ్జెటు, ఎగస్ట్రా జిమ్మిక్కుల అండ అసలు అక్కరే లేదు.
బాహుబలి ఒక సినిమా .చాలా స్పెషల్ సినిమా.దశాబ్దకాలంలో ఒక్కసారైనా అలాంటి అద్భుతం రావడం అనుమానమే.కాని వాళ్ళిద్దరు స్టార్ డమ్ లో అద్భుతాలు.ఆ ఇద్దరు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.తెలుగు సినిమా రారాజులు … పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు.
నిన్న మహాశివరాత్రి అన్న సంగతి తెలిసిందేగా .ఈ సందర్భంగా హైదరాబాద్లో హిట్ సినిమాల స్పెషల్ షోలు వేసారు.రికార్డు స్థాయిలో 27 థియేటర్లలో శ్రీమంతుడు స్పెషల్ షోలు వేసారు.మహేష్ అభిమానులు ఇది సినిమా తొలిరోజేమో అన్నంత సందడి చేసారు.ఇక సెకండ్ హయ్యస్ట్ షోలు ఏ సినిమాకో తెలుసా .బాహుబలికే .కేవలం నాలుగు షోలు.ఇది చాలు మహేష్ బాబుకి నైజాంలో ఉండే డిమాండ్ ఏంటో చెప్పడానికి.
ఇక నైజాంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమా బాహుబలి.దాదాపు 450 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదలైంది.
ఈ రికార్డుని రాజమౌళి అండ లేకుండానే దాటేస్తున్నాడు పవర్ స్టార్.అవును .సర్దార్ గబ్బర్ సింగ్ బాహుబలి నైజాం స్క్రీన్ కౌంట్ ని దాటనుంది.450 స్క్రీన్స్ కి పైగానే సర్దార్ విడుదల కానున్నట్లు సమాచారం.ఇదీ .నైజాంలో పవన్ కళ్యాణ్ స్టామినా!
ప్రపంచవ్యాప్తంగా ఏమోగాని … తెలుగు రాష్ట్రాల వరకు బాహుబాలి కలెక్షన్లను మరో ఒకటి రెండు సంవత్సరాల్లో మన సూపర్ స్టార్, పవర్ స్టార్ దాటేయడం ఖాయం.