ఇండస్ట్రీ కి రావడం చిరంజీవి తమ్ముడు గానే ఒచ్చినా తనకంటూ ఒక భారీ ఫ్యాన్ బేస్ నీ విపరీతమైన క్రేజ్ నీ సంపాదించి పెట్టుకున్నాడు హీరో పవన్ కళ్యాణ్.ఇప్పుడు రాజకీయ నాయకుడిగా , జన సేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలూ మరొక పక్క ఈ రాజకీయాలూ ఎలా మానేజ్ చేస్తున్నాడు అని చాలా మందికి ప్రశ్న .
కానీ అటు సినిమాలు, ఇటు రాజకీయాలను చేస్తూ ఉండడం వలన రెండింటికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు.ఈ విషయంపై పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి.
అందుకే పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఇక నుంచి కొద్ది రోజుల పాటు రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలపై దృష్టి సారించనున్నాడు.
ఇక నుంచి అభిమానులను వరుస సినిమాలతో మెప్పించనున్నాడు.అంతే కాక ఇప్పటికే కమిట్ అయిన అన్ని సినిమాలను చక చకా ఫినిష్ చేస్తున్నాడు.
అందుకే ప్రస్తుతం ఆయన చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ ని ఫినిష్ చేసి ఆన్ టైం అనగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు.అలాగే ఏప్రిల్ నుంచే తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాడు.
డైరెక్టర్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.