సినీ నటుడు, ‘జనసేన’ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలని 2014లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణాలో జనసేనకు రాజకీయ పార్టీ హోదా దక్కింది.
ఇప్పుడు కొత్తగా ఏపీలో కూడా జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.
ఈ మేరకు తాజాగా ఏపీ ఎన్నికల కమిషన్ జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో ఏపీలో జనసేనకు పొలిటికల్ హోదా దక్కినట్లు అయింది.ఈ సందర్భంగా ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పార్టీ గుర్తింపునకు సంబంధించిన పత్రాలను పంపించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, జనసేనను ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా గుర్తించినప్పటికీ పార్టీకి చిహ్నాన్ని మాత్రం ఇంకా కేటాయించలేదని తెలుస్తోంది.అయితే, గుర్తు కేటాయింపులో స్వతంత్ర అభ్యర్థుల కన్నా జనసేనకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
మరి ఏపీలో పొలిటికల్ హోదా అందుకున్న జనసేన ఇక ప్రత్యక్ష రాజకీయ సమరంలో అడుగుపెట్టడమే మిగిలింది.దీనికి పవన్ ఎప్పుడు రెడీ అవుతారో చూడాలి.