నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది.అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య హోరాహోరీగా ప్రచారం సాగుతోంది.
గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉండడంతో నంద్యాల ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతాడన్నది మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.టీడీపీ ఇక్కడ ఇప్పటికే ఆరుగురు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించితే, వైసీపీ కూడా తామేం తక్కువ తిన్నామా ? అంటూ 14 మంది ఎమ్మెల్యేలను ఇక్కడ బాధ్యులుగా దింపింది.ఆగస్టు 23న ఉప ఎన్నిక, 28న కౌంటింగ్ జరగనున్నాయి.
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కళ్యాణ్ టీడీపీ+బీజేపీ కూటమికి సపోర్ట్గా ప్రచారం చేశాడు.ఆ తర్వాత కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేయడంతో పవన్ బీజేపీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు.కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చుతూ దారుణంగా ఏకేశాడు.
ఇక ఇక్కడ టీడీపీని కూడా బీజేపీ రేంజ్లో కాకపోయినా లైట్గా ఏకేశాడు.
ఇక ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు.
మరి పవన్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ? అన్న ప్రశ్నకు టీడీపీకి పవన్ ప్రచారం చేస్తాడన్న టాక్ వచ్చింది.పవన్కళ్యాణ్ పార్టీ పరంగా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా భూమా ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు.
గతంలో భూమా దంపతులు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లినప్పటి నుంచి పవన్కు ఈ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది.
అప్పటి నుంచి వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది.
తర్వాత భూమా దంపతులు వైసీపీలోకి వెళ్లినా కూడా పవన్కళ్యాణ్తో ఆయన తరచూ ఫోన్ టచ్లో ఉండేవారు.ఇక భూమా దంపతులు మృతిచెందినప్పుడు కూడా పవన్ తీవ్రమనస్థాపం చెందాడు.
ఇక పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా భూమా తన శుభాకాంక్షలు చెప్పారు.ఈ నేపథ్యంలోనే పవన్ నంద్యాల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నంద్యాలలో టీడీపీ శ్రేణులు పవన్ ఫొటో పెట్టుకని ప్రచారం చేస్తున్నాయి.పవన్ మద్దతు తమకే అని ప్రచారం చేసుకుంటున్నాయి.
దీనిపై పవన్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.ఇక ఉప ఎన్నిక దగ్గరపడే టైంలో పవన్ డైరుక్టుగా ప్రచారానికి రాలేకపోయినా సోషల్ మీడియా ద్వారా టీడీపీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.