పవన్‌ ముఖ్య అతిధిగా..!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈనెల 14న మెగా ఫ్యాన్స్‌ ముందుకు రాబోతున్నాడు.మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘రేయ్‌’ సినిమాలోని ఒక పాటను విడుదల చేసేందుకు పవన్‌ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

 Pawan Kalyan To Launch Rey Movie Special Song-TeluguStop.com

వైవీఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రేయ్‌’ సినిమాలో పవనిజంపై ఒక పాటను పెట్టనున్నారు.ఇప్పటికే ఆడియో విడుదలైన ఈ సినిమాలో పవనిజం పాట అదనంగా జోడిరచనున్నారు.

చాలా కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేపాలంటే పవన్‌ కళ్యాణ్‌ రావాల్సిందే అంటున్నారు.

పవనిజం పాట విడుదలకు పవన్‌ కళ్యాణ్‌ వస్తే తప్పకుండా సినిమాపై మంచి అభిప్రాయం వస్తుందనే నమ్మకంతో చౌదరి ఉన్నాడు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ను తీసుకు వచ్చే బాధ్యతను సాయి తీసుకున్నాడు.మామయ్య పవన్‌తో సాయి మాట్లాడుతున్నాడు.

అల్లుడు సాయి కోసం పవన్‌ కళ్యాణ్‌ వస్తాడనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ ఉన్నారు.ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌కు జోడీగా సయామీ ఖేర్‌ మరియు శ్రద్దా దాస్‌లు నటించారు.

ఈ సినిమాకు స్వర్గీయ ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సంగీతాన్ని అందించాడు.త్వరలో విడుదల కాబోతున్న పవనిజం పాటకు కూడా చక్రి ట్యూన్‌ అందించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube