రీమేక్ సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ కి ఎంతకు అంత ఇష్టమో ఎవరికి అర్థం కాదు.కెరీర్ ని ఓ రీమేక్ తోనే ప్రారంభించిన పవన్, తోలిప్రేమ, బద్రి, త్రివిక్రమ్ సినిమాలు మినహాయిస్తే, రీమేక్స్ తోనే సక్సెస్ సాధించారు.
అందుకేనేమో పవన్ కి రీమేక్స్ పై అంత గురి.అయితే ప్రతీ రీమేక్ సక్సెస్ కాలేదు అనుకోండి.
అన్నవరం, కాటమరాయుడు లాంటి రీమేక్స్ ఫ్లాప్ కాగా, తమ్ముడు, ఖుషీ, గోకులంలో సీత, సుస్వాగతం, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు సక్సెస్ ని సాధించాయి.ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమ్ముడు ఆఫీషియల్ రీమేక్ కాదు, ఆమీర్ ఖాన్ నటించిన “జో జీతా వహి సికందర్” సినిమాలో మార్పులు చేసి తీసేసారు.
మళ్ళీ ఇన్నెళ్ళ తరువాత మరోసారి అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడు పవర్ స్టార్.త్రివిక్రమ్ సినిమా తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్బస్టర్స్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్ తో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్.
ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు.ఇది కూడా ఒరిజినల్ స్క్రిప్టు కాదు.
అలాగని పూర్తి రీమేక్ కూడా కాదు.తమిళంలో విజయ్ చేసిన తెరికి మార్పులు చేర్పులు చేసి స్క్రిప్టు రాసారు.
బౌండ్ స్క్రిప్టు రేడీగా ఉందట.సో, తమ్ముడు తరువాత మళ్ళీ కాపి స్క్రిప్టు అన్నమాట.
తెరి తెలుగులోకి పోలీసోడు పేరుతో అనువాదం అయిన తరువాత కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి పని చేయడం నిజంగా సాహసమే.మరి ఈ సాహసం సత్ఫలితాలను ఇస్తుందో, లేక పవన్ ఖాతాలో మరో ఫ్లాప్ పడుతుందో చూడాలి.