కాటమరాయుడి టార్గెట్ ఎవరు? అది ప్రెస్ మీట్ అయినా.బహిరంగ సభ అయినా జనసేనాని టార్గెట్ మాత్రం కమ్మ సామాజిక వర్గ పెద్దలేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు ఇందుకు నిదర్శనం! ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి చెందిన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి వారితో పాటు ఎంపీ రాయపాటిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.ఇప్పుడు హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు.
దీంతో ఇలా జనసేనాని కమ్మ సామాజిక వర్గ నేతలనే ఇలా టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు!
ఏపీతో పాటు దేశ రాజకీయాల్లోనూ వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య, సుజనాలే కేంద్రంలోని పెద్దలతో చర్చిస్తున్నారు.అయితే ఇప్పుడు హోదా బదులు ప్యాకేజీ ప్రకటించడంలోనూ వీరే కీలకం! దీంతో పవన్ కల్యాణ్ తొలి నుంచీ వీరినే దోషులుగా భావించి విమర్శలు గుప్పిస్తున్నారు.
తన కుమార్తె స్వర్ణభారత్ ట్రస్ట్పై చూపించిన శ్రద్ధ .ఏపీపై పెడితే బాగుంటుందని వెంకయ్యకు చురకలు అంటించారు పవన్.ఇక మరో కేంద్రమంత్రి సుజనాచౌదరి అవినీతి అక్రమాల ఫైలు ప్రస్తావన తీసుకొచ్చి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.మరో వైపు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ అయిన రాయపాటి సాంబశివరావు లక్ష్యంగా ఈ మధ్య కాలంలో తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న వైఖరిని జనసేనాని తప్పుబడుతున్నాడు.
దీంతో కమ్మ నేతలపై కాటమరాయుడు కత్తి దుస్తున్నాడటంతో ఆ సామాజికవర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పవన్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్రంగా విరుచుకుపడుతోంది.ఏపీ ప్రభుత్వంలోని కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారిపైనా అవినీతి ఆరోపణలు వస్తున్నా.
పవన్ ఎందుకు స్పందించడంలేదని వీరు ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.