పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు హెడింగ్ చూసి అప్పుడే కంగారు పడోద్దు.పవన్ కళ్యాణ్ రంజాన్ మాసం ఉపవాసాలు చేయడం లేదు.
కాని ఆయన అన్నం తినడం లేదు.ఇక్కడ అన్నం అంటే బియ్యం అన్నమాట.
పవర్ స్టార్ ఇకనుంచి వైట్ రైస్ తినకూడదు అని డిసైడ్ అయ్యాడట.ఈ నిర్ణయాన్ని అల్రెడి ఆచరణలో పెట్టాడట.
ఇంతకి పవన్ కళ్యాణ్ ఇలా సడెన్ గా రైస్ తినడం మానేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?
ఇదంతా లుక్ కోసమే అండి.మీకు తెలిసిందే.
వైట్ రైస్ లో కాలరీలు ఎక్కువ ఉంటాయి.అందుకే, మనలాంటి సాధారణ మనుషులు ఫిట్ గా ఉండటం చాలా అరుదుగా చూస్తుంటాం.
ఈమధ్యకాలంలో పవన్ ఫిట్ నెస్ సరిగా మేయింటేన్ చేయడం లేదు.ముఖంలో కూడా మునుపటి కళ లేదు.
ఎంతైనా 46 సంవత్సరాలు వచ్చాయి కదా.ఈ వయసులో గ్లామర్ మేయింటేన్ చేయడం కొంచెం కష్టమైన విషయమే అయినా, సినిమా ఫీల్ట్ లో ఉన్నాక తప్పదుగా.అందులోనూ త్రివిక్రమ్ సినిమాలో పవన్ పోషించేది ఒక ఐటి ఉద్యోగి పాత్ర అని టాక్.మరి అలాంటప్పుడు కొంచెం యంగ్ గా, ఫిట్ గా కనిపించాలి కదా.అందుకే పవన్ కళ్యాణ్ ని రైస్ తినడం మానేయమని త్రివిక్రమ్ సజెస్ట్ చేసారట.
కనీసం మరో ఐదారు నెలల వరకైనా పవన్ కళ్యాణ్ ఇంట్లో బియ్యం వండటం దాదాపుగా అసాధ్యం.
పవన్ అల్రెడి ఒక డైటీషన్ ని కలిసి తనకు కావాల్సిన డైట్ ని ప్లాన్ చేసుకున్నాడట.ఇక అన్నానికి బదులు అవే సలాడ్స్, అవే స్టిమ్డ్ మాంసం తినమంటారేమో.
ఇక జిమ్ లో కూడా చెమటలు చిందిచనున్నాడు పవర్ స్టార్.ఇన్ని కష్టాలు పడేది అభిమానుల కోసమేగా.