రెండు రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిని వేరే హీరో అభిమాని కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే.ఒక అభిమానిగానే కాదు జనసేన యువ నేతగా వినోద్ ఎంతో చురుగ్గా పనిచేసేవాడు.
అయితే వినోద్ మరణ వార్త విని పవన్ ఈరోజు తిరుపతిలో వినోద్ ఇంటికి చేరుకున్నారు.పవన్ రాగానే వినోద్ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడ్చి తన బాధను వెళ్ళగక్కింది.
జరిగిన విషయాన్ని పవన్ కు వివరించి చెప్పిన వినోద్ అమ్మగారు త్వరలో తన కొడుకు అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యాడని చెప్పింది.
అయితే పవన్ రాకముందు నుండే తమకు పవన్ సహాయం చేస్తానన్న తమకు అవసరం లేదు కాని నిందితుడికి శిక్ష పడాలని అన్నది.
ఇక పవన్ రాగానే రాఖి కట్టిన వినోద్ తల్లి వినోద్ చేసిన జనసేన కార్యక్రమాల ఫోటోలను పవన్ కు చూపించింది.అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ జనసేన సైనికుడు చనిపోవడం చాలా బాధాకరమని.
అభిమానం ఉండాలి కాని ఇలా చంపుకునే అభిమానం ఉండకూడదని అన్నారు.నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని అవసరం అయితే అక్కడ స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా తీసుకుంటామని అన్నారు.
ఇక ఈ సంఘటనతో పవన్ కళ్యాన్ అభిమానులంతా తిరుపతి వినోద్ ఇంటి వద్ద భారీగా వచ్చారు.