రేపు జనసేన భారి బహిరంగ సభ

సినీనటుడు, జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమాని, పార్టీ కార్యకర్త వినోద్ రాయల్ హత్యపై విచారం వ్యక్తం చేస్తూ, వినోద్ తల్లిదండ్రులని తిరుపతిలో పరామర్శించిన సంగతి తెలిసిందే.రెండు రోజులుగా తిరుపతిలోనే ఉన్న పవన్, అక్కడే జనసేన కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు.

 Janasena Public Meet Tomorrow In Tirupati-TeluguStop.com

ఇంతలోనే బహిరంగ సభ ప్రకటన వచ్చింది.అవును, రేపు తిరుపతిలో జనసేన పార్టీ భారి బహిరంగసభ నిర్వహించబోతోంది.

పార్టి ఆవిర్భవించాక ఆ పార్టీ నిర్వహించబోతున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం.ఈ సభ రేపు సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని ఇందిర మైదానంలో ప్రారంభమవుతుంది.

జనసేన పార్టి విధివిధానాల గురించి, వచ్చే ఆసెంబ్లీ ఎలక్షన్లపై పార్టీ ఆలోచనల గురించి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల గురించి రేపు పవన్ మాట్లాడుతారని తెలియవస్తోంది.ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల గురించి ఇప్పటికే పలువురు కాపు సంఘాల నేతలు పవన్ ని కలిసి మాట్లాడారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube