బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్నశ్రీజ చివరి కోరిక ను నెరవేర్చడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఖమ్మం వచ్చిన సంగతి తెలిసిందే .అయితే ఖమ్మంఆసుపత్రి లో శ్రీ జ ఆరోగ్య పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ చలించి పోయారు.
ఓ దశలో పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు.పలుమార్లు శ్రీజ అంటూ పేరు పెట్టి పవన్ పిలిచినట్టు, అయితే బాలిక స్పందించకపోవడంతో పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఆసుపత్రి డాక్టర్ లతో మాట్లాడి శ్రీజ ను బ్రతికించడానికి ఉన్న అవకాశాలను పవన్ తెలుసుకున్నారు .అంతే కాకుండా వైద్యం కోసం కుటుంబ సభ్యులకు రెండులక్షల రూపాయలను పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు సమాచారం తమ కూతురిని చూడడానికి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద నటుడు రావడం తో శ్రీజ తల్లిదండ్రులు భాధ లో కూడా తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు .మరొకవైపుపవన్కల్యాణ్ ఈ రోజు చిన్న కార్ ప్రమాదం నుంచి బయటపడ్డారు.తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు ఉత్తరాంధ్ర వెళ్లిన ఆయన అక్కడి నుంచి శుక్రవారం రోడ్డు మార్గం న ఖమ్మం వెళుతుండగా, కొణిజర్ల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
అయితే పవన్ కు ఎలాంటి గాయాలుకాలేదు.