పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు … ఇద్దరు ఇద్దరే.కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ తో ఆగిపోకుండా, అన్నివర్గాల్లోను ఫాలోయింగ్ పెంచుకున్న నటులు.
అందుకే ఈ ఇద్దరిని ప్రస్తుత తెలుగు సినిమాకి రెండు కనుల లాంటివారని అంటారు.బాక్సాఫీసు రికార్డులు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటి .అన్ని వీరి సొంతం.ఈ విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాని, ప్రేమమ్ దర్శకుడు చందు మొండేటి మన సూపర్ స్టార్ – పవర్ స్టార్ మీద పొగడ్తల వర్షం కురిపించేసాడు.వారిద్దరూ ఈ అభిమానాన్ని చూడడానికే పుట్టారట.
“నేను వాళ్ళిద్దరిని గౌరవిస్తాను.పవన్ కళ్యాణ్ గారు కాని, మహేష్ బాబు గారు కాని, అంతమందిని ఆకర్షిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు.బయట ఒకరో ఇద్దరో సెల్ఫీ అడిగితేనే అబ్బో మనల్ని అడుగుతున్నారనే ఫిలింగ్ కలుగుతుంది.
అలాంటిది లక్షలమంది వాళ్ళు సెటిల్డ్ గా కనబడితేనే అరుస్తున్నారంటే , దే ఆర్ బార్న్ ఫర్ ఏ రీజన్.నేను వాళ్ళ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు ఈ యువ దర్శకుడు.
అంతేకాదు, శ్రీమంతుడు ఫ్యాన్స్ షోకి ఒక అభిమాని లాగే పేపర్లు వేయడం, ఈలలు వేయడం చేసానని, ఆ సినిమాకి చాలా బాగా ఎంజాయ్ చేసానని, ఏ సినిమా అయినా బెనిఫిట్ షో చూడటమే తనకు అలవాటని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్డాడు మన ప్రేమమ్ ఫిలింమేకర్.