ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సీపీఐ పార్టీకి కార్యదర్శిగా పని చేసి, ప్రస్తుతం జాతీయ నాయకత్వంలో ఉన్న డాక్టర్ నారాయణ నోటికి పదును ఎక్కువ అనే సంగతి చాలా మందికి తెలుసు.కమ్యునిస్టు పార్టీల్లో దాదాపుగా ఎవరు అదుపు తప్పి మాట్లాడరు.
కాని నారాయణ అందుకు మినహాయింపు.బూర్జువా పార్టీల నాయకుల్లా మాట్లాడతారు.
పదునైన విమర్శలు చేస్తారు.చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తలనొప్పులు తెచ్చుకున్నారు.
సోదర కమ్యునిస్టు పార్టీ సీపీఎమ్ పై పదునైన విమర్శలు చేయడానికి కూడా వెనుకాడరు.ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎమ్ కార్యదర్శి రాఘవులు, నారాయణ అనేకసార్లు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు కూడా.
సీపీఎమ్ నాయకత్వం కొంత కాలం పాటు తన పత్రికలో నారాయణ వార్తలను నిషేధించింది.వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, క్షమాపణ చెప్పడం ఆయనకు అలవాటే.
నారాయణ గురించి ఇంత కథ ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందటే తాజాగా ఆయన పవర్ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసారు.ఆంధ్రా రాజకీయాల్లో పవన్ అదనపు ఆటగాడు (ఎగ్ష్ట్రా ప్లేయర్) అని విమర్శించారు.
పవన్ కొన్ని ఎంపిక చేసుకున్న అంశాల మీదనే మాట్లాడుతున్నారని అన్నారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా అడగడానికి టీడీపీ, వై కా పా భయపడుతున్నాయని అన్నారు.
నోటుకు వోటు కేసులో ఇరుక్కోవడంతో చంద్ర బాబు, అవినీతి కేసుల్లో ఉండడంతో జగన్ కేంద్రానికి భయపడుతున్నారని నారాయణ చెప్పారు.వీరిద్దరితో పాటు పవన్ కూడా భయపడుతున్నాడని నారాయణ అభిప్రాయమా?
.