టాలీవుడ్లో మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య ఎంతటి వృత్తి వైరుద్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ రెండు ఫ్యామిలీల ఫ్యాన్స్ కొన్ని కొన్ని సార్లు బాహాటంగానే కొట్టుకున్న సందర్బాలు ఉన్నాయి.
అటువంటి ఈ రెండు ఫ్యామిలీల హీరోలు ఒకే స్టేజ్పై కనిపించడం అంటే అది ఒక అద్బుతంగా తెలుగు ప్రేక్షకులు భావిస్తారు.అప్పుడప్పుడు మాత్రమే సాధ్యం అయ్యే ఆ అద్బుతం త్వరలో మరోసారి జరుగబోతుంది అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో తెగ వార్తలు వస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 99వ సినిమా ‘డిక్టేటర్’ ఆడియో విడుదల కార్యక్రమానికి మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.
సినీ వర్గాల నుండి మొదలైన ఈ ప్రచారంలో ఒక్క శాతం అయినా నిజం ఉండక పోవచ్చు అని కొందరు అంటున్నారు.
‘డిక్టేటర్’ ఆడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుపబోతున్నారు.ఆ ఆడియోకు ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
ఇక అదే ఆడియోకు పవన్ కళ్యాణ్ రావడం అనేది దాదాపుగా అసాధ్యం అని, ఇదేదో గాలి వార్త మాత్రమే అని స్పష్టంగా కాస్త ఆలోచిస్తే అర్థం అవుతోంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న ‘సర్దార్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
అటువంటి పవన్ ఈ సినిమా ఆడియోకు వస్తాడు అనుకోవడం తెలివితక్కువతనం అవుతుందని కొందరు అంటున్నారు.