అనంతపురం రాజకీయాల్లో జేసీల హవాకు ఎదురులేదు.ఏ పార్టీలో ఉన్నా వారి ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది.
అయితే వారు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో.జనసేనాని పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
దీని తర్వాత తరువాత అనంతపురంపై మీడియా అటెన్షన్ మరింతగా పెరిగింది.జిల్లాలో జేసీ బ్రదర్స్ కు ఉన్న ప్రాధాన్యత, మరోవైపు తాను తొలిసారి పోటీ చేయడానికి పవన్ అదే జిల్లాని ఎంచుకోవడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి.
అయితే జేసీ సోదరులు తమ వారసులను తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉండటంతో.వీరు పవన్ను ఎలా ఎదుర్కొంటారనేది ఉత్కంఠ నెలకొంది.
టీడీపీకి అనంతపురం కంచుకోట.జేసీ సోదరులు ఒకవైపు, నందమూరి బాలకృష్ణ, పరిటాల వర్గం మరోవైపు ఇలా.అందరూ ఉద్ధండులే ఉండటం.ఇదే సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవర స్టార్ పవన్ కి ఇక్కడ భారీ ఫాలోయింగ్ ఉండటంతో అనంత రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
ఈ సమయంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర రెడ్డి కూడా రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జేసీ తన కుమారుడు పవన్ ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.అందుకోసం ఆయన తన వ్యూహాలకు పదును పెట్టారని అంటున్నారు.
మరో వైపు దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే ఆలోచనతో ఉన్నారట.ఆయన తన కుమ్మాడు అస్మిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలని భావిస్తున్నట్లు జేసీ సోదరుల అనుచరుల చెబుతున్నారు.
ఇప్పటికే జెసి తనయుడు పవన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఫ్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నాడట.
ఈనేపథ్యంలో దివాకర్రెడ్డి తనయుడు పవన్ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది.
దీంతో పవన్ను నిలువరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా వ్యూహాన్ని అమలుచేస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే పవన్పై టీడీపీ అభ్యర్థిగా జేసీ కుమారుడు పవన్ రెడ్డిని బరిలోకి దించేలా బాబు వ్యూహం పన్నుతున్నారట.
అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కార్పొరేషన్ పదవి ఇస్తామని ఆ సీటు పవన్రెడ్డికి సీటు ఇస్తారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.మరి ఇదే జరిగితే జేసీ వారసులకు పవన్ సవాలు విసరడం ఖాయం!!
.