ఎనర్జిటిక్ హీరో రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన మూవీ ‘పండుగ చేస్కో’.ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా స్క్రిప్ట్లో పలు సార్లు మార్పులు మరియు రీ షూట్ల వల్ల చాలా లేట్ అయ్యింది.
‘బలుపు’ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదట మంచి అంచనాలు ఉండే.కాని ఆలస్యం అవ్వడంతో సినిమా గురించి అంతా మర్చి పోయారు.
ఇంత కాలంకు ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
సుధీర్ఘంగా జరుగుతున్న షూటింగ్ త్వరలో ముగియబోతుంది.
ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉందని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు.ఈ నెల మూడవ వారం వరకు షూటింగ్ పూర్తి చేస్తాం అని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పుకొచ్చాడు.
వచ్చే నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాత ఉన్నట్లుగా తెలుస్తోంది.రామ్ వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యేలా ఉంటుందా అనేది విడుదల అయితే కాని చెప్పలేం.